ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బేబీ’. సాయి రాజేష్ దర్శకుడు. ఎస్కేఎన్ నిర్మించారు. వచ్చే నెల రెండో వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘ఇటీవల విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది.
యువతరానికి నచ్చే అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రంలో ఉండే సున్నితమైన భావోద్వేగాలు అందరిని ఆకట్టుకుంటాయి. విజయ్ బల్గానిన్ సంగీతం చిత్రానికి అదనపు వన్నెను తెచ్చింది’ అన్నారు.