Vishwambhara | మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం విశ్వంభర సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. సోషియో-ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా.. త్రిష కథానాయికగా నటిస్తుంది. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక సాలిడ్ అప్డేట్ వైరల్గా మారింది. ఈ సినిమాలో ఓ రీమిక్స్ సాంగ్ ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది.
తాజా సమాచారం ప్రకారం, చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమాలోని ఏదైన ఒక పాటను ‘విశ్వంభర’ సినిమాలో రీమిక్స్ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చ జరుగుతోంది. బాలీవుడ్ నటి మౌని రాయ్ ఈ స్పెషల్ సాంగ్ లో చిరంజీవితో కలిసి స్టెప్పులు వేయనున్నారని కూడా సమాచారం. ‘విశ్వంభర’ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.