గౌతమ్ రాజ్, సాయి విక్రాంత్, మధుప్రియ, లావణ్య శర్మ, సిరి, అంబిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘అమ్మ నాన్న మధ్యలో మధురవాణి’. యాదయ్య గౌడ్ సమర్పణలో మానస క్రియేషన్స్ పతాకంపై బృందాకర్ గౌడ్ నిర్మిస్తున్నారు. టీడీ ప్రసాద్ వర్మ దర్శకుడు. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు టీడీ ప్రసాద్వర్మ మాట్లాడుతూ…‘గతంలో ‘రాధాకృష్ణ’ అనే చిత్రాన్ని రూపొందించాను. ఇది నా రెండో సినిమా. వినోదాత్మక కుటుంబ కథా చిత్రమిది. రెండు తరాలకు చేరువయ్యేలా ఉంటుంది. ఏప్రిల్ మొదటి వారం నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం. రెండు షెడ్యూల్స్లో సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నాం’ అన్నారు. నరేష్ వీకే, పవిత్రా లోకేష్, నందమూరి తారకరత్న తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : వాసు, ఎడిటింగ్ : శివ శర్వాణి, సాహిత్యం : మిట్టపల్లి సురేందర్, సంగీతం : కార్తీక్ బి కడకండ్ల.