Amitabh Bachchan Pushpa dialogue | ‘బాహుబలి’ తర్వాత ఆ స్థాయిలో పరభాషల్లో ఆకట్టుకున్న చిత్రం ‘పుష్ప’. అల్లుఅర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించాడు. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. కేవలం తెలుగులోనే కాకుండా విడుదలైన ప్రతి భాషలో కాసుల వర్షం కురిపించింది. ఎలాంటి ప్రమోషన్లు చేయకుండానే హిందీలో వంద కోట్ల కలెక్షన్లను సాధించి రికార్డు సృష్టించింది. సుకుమార్ టేకింగ్, విజన్కు సినీప్రముఖులు సైతం జైజైలు కొట్టారు. బన్నీ నటన, అభినయానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక సినిమా విడుదలై నాలుగు నెలలు దాటినా ఇంకా పుష్ప క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా బిగ్బీ అమితాబ్ బచ్చన్ పుష్ప డైలాగ్ను చెప్పాడు.
ముఖ్యంగా పుష్ప చిత్రంలోని డైలాగ్స్ ఎంతగానో పాప్యులర్ అయ్యాయి. సినీప్రముఖుల నుంచి క్రికేటర్ల వరకు పుష్ప డైలాగ్స్ను రీల్స్ చేశారు. ముఖ్యంగా కొందరు రాజకీయనాయకులు ఏకంగా ప్రచారాలలో కూడా పుష్ప డైలాగ్స్ను వాడారు. ఇదిలా ఉంటే తాజాగా బిగ్బీ అమితాబ్ బచ్చన్ కూడా పుష్పలోని డైలాగ్ను చెప్పాడు. బిగ్బీ ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ ప్రోగ్రాంలో భాగంగా ‘పుష్ప నామ్ సున్ కే ఫ్లవర్ సమ్జే క్యా.. ఫైర్ హు మే’ అని డైలాగ్ చెప్తూ.. పుష్ప చిత్రంలో చూపించిన ఎర్రచందనం, భారతదేశంలో ఏ ప్రాంతానికి చెందినవి అనే క్వశ్చన్ను అమితాబ్ అడిగాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
💖💝😍
Lovely lovely
Listening to #Pushpa Dialogue in the voice of One and Only Big B
✨💫💞 https://t.co/0E8dCH539J— Mythri Movie Makers (@MythriOfficial) April 23, 2022
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ‘పుష్ప’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్రలో నటించిన ఈ చిత్రంలో బన్నీకి జోడిగా రష్మిక హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం ‘పుష్ప పార్ట్-2’ పనులు ప్రారంభమైయ్యాయి. వీలైనంత త్వరగా చిత్రాన్ని పూర్తి చేసి ప్రమోషన్లను జోరుగా జరుపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.