Actress Ameesha Patel | మరో నెల రోజుల్లో విడుదల కాబోతున్న గదర్-2పై బాలీవుడ్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో సన్నిడియోల్గా జోడీగా బాలీవుడ్ నటి అమీషా పటేల్ నటించింది. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో అమీషా పటేల్ బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలతో తెగ బిజీగా గడుపుతుంది. కాగా తాజాగా ఈ బ్యూటీ ఓటీటీల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓటీటీలల్లో క్లిన్ కంటెంట్ ఉండట్లేదని, స్వలింగ సంపర్కం(హోమో సెక్స్), గే-లెస్బియానిజం(LGBTQ) ఎక్కువగా ఉంటున్నాయని ఈ బ్యూటీ వెల్లడించింది. అలాంటి వాటిని పిల్లలకు దూరంగా ఉంచండని, ఖచ్చితంగా పిల్లలు చూసే కంటెంట్ ఉండదని అని అమీషా పటేల్ వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసే యుగం ఇది కాదని తెలిపింది. అమీషా చేసిన వ్యాఖ్యల భిన్నాభిప్రాయాలు వెల్లువడుతున్నాయి.
హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘కహో నా.. ప్యార్ హే’ సినిమాతో బాలీవుడ్ చిత్ర సీమలోకి అడుగుపెట్టింది అమీషా పాటేల్. అప్పట్లో ఈ సినిమా నెలకొల్పిన రికార్డులు అంతా ఇంతా కాదు. ఇక అదే ఏడాది పవన్తో ‘బద్రి’ సినిమా చేసింది. ఈ సినిమా ఇక్కడ బంపర్ హిట్టయింది. ఇలా ఒకే ఏడాది రెండు ఇండస్ట్రీలలో ఎంట్రీ ఇచ్చి.. రెండిట్లోనూ బ్లాక్ బస్టర్లు కొట్టిన ఘనత అమీషా పటేల్కే దక్కింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెగ బిజీగా గడిపింది. తెలుగులో ఎక్కువగా సినిమాలు చేయకపోయినా బాలీవుడ్లో మాత్రం మూడు, నాలుగేళ్లు ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసింది.
ఆ తర్వాత సడెన్గా ఆమె కెరీర్ స్లో అయిపోయింది. ఒకానొక దశలో సినిమా సినిమాకు దాదాపు రెండు, మూడేళ్లు గ్యాప్ తీసుకుంది. చివరిగా ఈమె 2018లో వచ్చిన భయ్యాజీ సూపర్ హిట్ సినిమాలో కనిపించింది. ఇక ఇప్పుడు మళ్లీ ఐదేళ్ల తర్వాత గదర్-2తో రీ ఎంట్రీ ఇస్తుంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యలో తెరకెక్కిన ఈ సినిమా 2001లో వచ్చిన గదర్: ఏక్ ప్రేమ్ కథా సినిమాకు సీక్వెల్గా తెరకెక్కుతుంది. తొలి సినిమాలో కలిసి నటించిన సన్నీ డియోల్, అమీష్ పటేల్ సీక్వెల్లోనూ నటిస్తున్నారు. ఆగస్టు 11న విడుదల కాబోతున్న ఈ సినిమాపై హిందీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.