సుహాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. దుశ్యంత్ కటికినేని దర్శకుడు. వెంకటేష్ మహా, ధీరజ్ మొగిలినేని నిర్మాతలు. ఈ చిత్ర టీజర్ను సోమవారం ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘కామెడీ డ్రామా చిత్రమిది. సుహాస్ కెరీర్లోనే వైవిధ్యమైన చిత్రంగా నిలిచిపోతుంది. ప్రతి సన్నివేశం సహజంగా ఉంటుంది. అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ హంగామా ఏమిటో తెరపై చూడాల్సిందే’ అన్నారు.
తన కెరీర్లోనే ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రమవుతుందని హీరో సుహాస్ అన్నారు. పల్లెటూరి నేపథ్యంలో అత్యంత సహజంగా ఈ సినిమా తీశారని, కథానుగుణంగా సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంటుందని సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకులు మారుతి, హను రాఘవపూడి, శైలేష్ కొలను, సాయిరాజేష్ తదితరులు పాల్గొన్నారు.