Cinema News | అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘బడ్డీ’. గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్సింగ్ ఇందులో హీరోయిన్లు. శామ్ ఆంటోన్ దర్శకుడు. కేఈ జ్ఞానవేల్రాజా, అధన జ్ఞానవేల్రాజా నిర్మాతలు. ఈ నెల 26న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఇందులోని ‘ఫీల్ ఆఫ్ బడ్డీ’ లిరికల్ సాంగ్ని మేకర్స్ విడుదల చేశారు.
‘చూశాలే.. చూశాలే.. చూశాలే నీలో నా కలనే.. దాచాలే.. దాచాలే.. దాచాలే నాలో ఆ కలనే..’ అంటూ సాగే ఈ పాటను సాయిహేమంత్ రాయగా, హిప్ హాప్ తమిళ స్వరపరిచి, ఐరా ఉడుపితో కలిసి ఆలపించారు. యువతరానికి నచ్చే కథ, కథనాలతో ఈ సినిమా సాగుతుందని మేకర్స్ చెబుతున్నారు. అజ్మల్ అమీర్, ముఖేశ్ కుమార్, అలీ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కృష్ణన్ వసంత్, నిర్మాణం: స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్.