అల్లు అర్జున్ ‘పుష్ప -2’ షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతున్నది. బన్నీ, రష్మికతో పాటు ముఖ్యతారాగణంపై దర్శకుడు సుకుమార్ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇదిలావుంటే.. ఈ షూటింగ్కి ఓ రెండురోజులపాటు బన్నీ బ్రేక్ ఇవ్వనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఢిల్లీలో జరగబోయే జాతీయ అవార్డుల ప్రదానోత్సవమే ఈ విరామానికి కారణం.
‘పుష్ప’ చిత్రానికిగాను జాతీయ ఉత్తమ నటుడిగా బన్నీ ఎంపికైన విషయం తెలిసిందే. ఆ వేడుకకు హాజరై అవార్డు అందుకుని, తిరిగి ‘పుష్ప-2’ షూటింగ్లో పాల్గొంటారట బన్నీ. దర్శకుడు సుకుమార్ ఈ డిసెంబర్ చివరికల్లా షూటింగ్ పూర్తిచేయాలనే దృఢనిశ్చయంతో ఉన్నారు. అందుకే త్వరితగతిన షూటింగ్ జరుపుతున్నారు. డిసెంబర్ నాటికి షూటింగ్ పూర్తిచేసి, జనవరి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టాలనేది సుక్కూ ప్లాన్.
‘పుష్ప-2’ పోస్ట్ప్రొడక్షన్ వర్క్కు ఆయన ఎక్కువ సమయం తీసుకోనున్నట్టు తెలుస్తున్నది. ఇక ‘పుష్ప-2’ ప్రమోషన్లు కూడా మూడు నెలల ముందుగానే మొదలుపెట్టాలని సుకుమార్ భావిస్తున్నారట. భారతీయ భాషల్లోనే కాక, చైనా, జపాన్ లాంటి ఇతర దేశాల్లో కూడా ఈ చిత్రాన్ని అనువదించి ఒకేసారి విడుదల చేయాలనే సంకల్పంతో సుకుమార్ టీమ్ ఉన్నట్టు తెలిసింది.