Allu Arjun | పుష్ప.. ది రైజ్ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్ (Allu Arjun). ఈ సినిమాతో ఐకాన్ స్టార్గా మారిపోయాడు. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో రాబోతున్న ప్రాంచైజీ ప్రాజెక్ట్ పుష్ప.. ది రూల్ (Pushpa the rule) షూటింగ్తో బిజీగా ఉన్నాడు. కాగా ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని (World Environment Day) పురస్కరించుకొని మొక్క నాటాడు బన్నీ. మొక్క నాటి నీరు పోస్తున్నప్పుడు దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తన అభిమానులు పర్యావరణాన్ని, భూమిని రక్షించేందుకు మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశాడు. ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథాంశంతో తెరకెక్కుతున్న పుష్ప చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తోంది. కన్నడ భామ రష్మిక మందన్నా మరోసారి సీక్వెల్లో కూడా ఫీ మేల్ లీడ్ రోల్లో శ్రీవల్లిగా మెరువనుంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అనసూయ భరద్వాజ్, అజయ్, సునీల్, జగదీష్ ఇతర నటీనటులు కీ రోల్స్ చేస్తున్నారు. పార్టు 1కు అదిరిపోయే ఆల్బమ్ అందించిన రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
పుష్ప.. ది రైజ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. రష్యాలో కూడా విడుదలై టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. సీక్వెల్లో వచ్చే సన్నివేశాలు హైటెక్నికల్ వ్యాల్యూస్తో ఫస్ట్ పార్టును మించి ఉండబోతున్నాయట.
Happy World Environment Day. Let’s all of us do our small bit … 💚 pic.twitter.com/KzTEXeXOBF
— Allu Arjun (@alluarjun) June 5, 2023