టాలీవుడ్ (Tollywood నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) తన కుమారులతో ఎంత క్లోజ్గా ఉంటారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తనయులతో కలిసి అప్పుడపుడు పలు ఈవెంట్లకు వెళ్తుంటారు. టైం దొరికినపుడల్లా వారితో సరదా సమయాన్ని గడపుతుంటారు. తాజాగా ఈ సీనియర్ ప్రొడ్యూసర్ తన పెద్ద కుమారుడు అల్లు వెంకటేశ్ (Allu Venkatesh) తో కలిసి పెయింటింగ్ ఆర్టిస్టుగా మారిపోయారు. అల్లు అరవింద్, వెంకటేశ్ హైదరాబాద్లోని సృష్టి ఆర్ట్ గ్యాలరీ (Srishti Art Gallery Hyderabad)ని ఆదివారం సందర్శించారు.
ఇద్దరూ కలిసి బ్రష్ చేతబట్టి ఓ పెయింట్ (painting art)వేశారు. ఆ తర్వాత ఆ పెయింటింగ్ పక్కన నిలబడి కెమెరాకు పోజులిచ్చారు. తండ్రితో కలిసి అల్లు వెంకటేశ్ దిగిన ఈ ప్రత్యేకమైన ఫొటో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతుంది. అల్లు అరవింద్ ప్రస్తుతం పలు సినిమాలను నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. తెలుగు, హిందీ సినిమాలతోపాటు ఆహా ఒరిజినల్స్ మేకింగ్ లో బిజీగా ఉన్నారు. మరోవైపు అల్లు వెంకటేశ్ టాలీవుడ్ యువ హీరో వరుణ్ తేజ్ నటిస్తోన్న గని చిత్రంతో నిర్మాతగా తెరంగేట్రం చేస్తున్నాడు.
నిర్మాతగా మంచి సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నాడు అల్లు వెంకటేశ్. మరి తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ నిర్మాతగా ఎంతవరకు సక్సెస్ అవుతాడనేది చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Samantha: సమంత బాలీవుడ్ సినిమాలపై ఆసక్తి చూపడానికి ఆ హీరోయిన్ కారణమా?Chiranjeevi: మెగాస్టార్ న్యూ లుక్.. షాక్ అవుతున్న ఫ్యాన్స్
Puneet Raj Kumar: పునీత్ చివరి సినిమా కోసం మేకర్స్ సరికొత్త ప్రయత్నం..!