అల్లరి నరేశ్ (Allari Naresh) లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం (Itlu Maredumilli Prajaneekam). ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీని నవంబర్ 25న థియేటర్లలో గ్రాండ్గా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ అప్డేట్ అందించారు మేకర్స్. మొదట థియేటర్లలో ట్రైలర్ లాంఛ్ చేసిన తర్వాత మరుసటి రోజు యూట్యూబ్లో లాంఛ్ చేయనున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
ఈ చిత్ర ట్రైలర్ నవంబర్ 11న థియేటర్లలో, నవంబర్ 12న యూబ్యూట్లో సందడి చేయనుంది. వెన్నెల కిశోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.
మారేడుమిల్లి అనే ఓ గ్రామం ప్రపంచానికి దూరంగా, కనీస అవసరాలు లేకుండా అడవుల మధ్యలో జీవనం సాగిస్తుంటుంది. అక్కడికి పోలింగ్ అధికారిగా ఓట్లు వేయించడం కోసం అల్లరి నరేష్ తన టీంతో కలిసి వెళ్తాడు. ఈ క్రమంలో గ్రామంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే నేపథ్యంలో సినిమా సాగనున్నట్టు ఇప్పటికే విడుదలైన టీజర్ ద్వారా అర్థమవుతుంది. అల్లరి నరేశ్ నాంది తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
Witness #ItluMaredumilliPrajaneekam Theatrical Trailer Exclusively in Theatres from Nov 11th! 💥
DIGITAL RELEASE ON NOV 12th ✅#IMP #IMPonNov25th 🔥@allarinaresh @anandhiactress @dir_armohan @ZeeStudios_ @HasyaMovies @RajeshDanda_ @lemonsprasad @_balajigutta @vennelakishore pic.twitter.com/kE3fHGWWfT
— Zee Studios South (@zeestudiossouth) November 10, 2022
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం టీజర్ ..