Allari Naresh | ‘నాంది’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్కు నాంది పలికి సెలెక్టెడ్గా సినిమాలు చేస్తూ ముందుకు పోతున్నారు అల్లరి నరేశ్. ఒకప్పుడు తనొక హాస్య కథానాయకుడు. ప్రస్తుతం ఆ తరహా పాత్రలకు విరామం ప్రకటించి, భావోద్వేగపూరితమైన కథలను ఎంపిక చేసుకుంటూ ఎమోషనల్ జర్నీ మొదలుపెట్టారు అల్లరి నరేశ్. రీసెంట్గా తాను చేసిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం సినిమాలు విమర్శకుల ప్రశంసలందుకోవడమే కాక, నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాయి.
ప్రస్తుతం ‘సభకు నమస్కారం’ అనే సినిమాలో చేస్తున్నారు నరేశ్. ఇదిలావుంటే.. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో నాగార్జున ‘నా సామిరంగ’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఓ ప్రత్యేక పాత్ర కోసం దర్శక, నిర్మాతలు అల్లరి నరేశ్ని సంప్రదించారు. చిన్నప్పట్నుంచీ తను అక్కినేని నాగార్జున వీరాభిమాని కావడంచేత.. అడగ్గానే మారుమాట్లాడకుండా పచ్చజెండా ఊపేశారట అల్లరి నరేశ్. ఈ సినిమాకోసం ప్రస్తుతం చేస్తున్న సినిమా డేట్లు కూడా అడ్జెస్ట్ చేసుకున్నాడంట. త్వరలోనే అల్లరి నరేశ్కు సంబంధించిన షూటింగ్ మొదలుకానున్నట్టు విశ్వసనీయ సమాచారం.