బాలీవుడ్ అగ్ర కథానాయిక అలియాభట్ నిర్మాతగా మారారు. ‘పోచర్’ అనే క్రైమ్ సిరీస్కు ఆమె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తించనుంది. ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ ఈ నెల 23 నుంచి స్ట్రీమింగ్కానుంది. రిచీ మోహతా ఈ సిరీస్కు దర్శకత్వం వహించారు. ఏనుగు దంతాల స్మగ్లింగ్ నేపథ్యంలో క్రైమ్, మాఫియా అంశాలతో ఈ సిరీస్ను తెరకెక్కించారు.
అమెజాన్ ప్రైమ్ వంటి ప్రముఖ సంస్థతో కలిసి నిర్మాతగా బాధ్యతలు నిర్వహించడం ఆనందంగా ఉందని అలియాభట్ చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘ఈ సిరీస్లో గొప్ప సందేశం ఉంటుంది. కేవలం మనుషులపైనే కాదు ఈ భూమి మీద నివసించే ప్రతీ జీవిపై మనం కరుణ చూపించాలనే మానవీయ కోణంలో ఈ సిరీస్ను రూపొందించారు. తప్పకుండా ఇది అందరిలో పరివర్తన తీసుకొస్తుంది. ఈ సందేశం చాలా మందికి చేరుతుంది’ అని అలియాభట్ పేర్కొంది.