విజయ్కృష్ణ, సంజనాచౌదరి నాయకానాయికలుగా నటిస్తున్న ‘అలర్ట్’ చిత్రం సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. మూర్తికొడిగంటి దర్శకుడు. మల్లిఖార్జున్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కె.ఎల్.దామోదరప్రసాద్ క్లాప్నివ్వగా, బెక్కెం వేణుగోపాల్ కెమెరా స్విఛాన్చేశారు. వి. సముద్ర గౌరవ దర్శకత్వం వహించారు. విజయ్కృష్ణ మాట్లాడుతూ ‘నేను హీరోగా నటిస్తున్న నాలుగో చిత్రమిది. ఆన్లైన్ మోసాల బారిన పడిన యువత ఎలాంటి కష్టాల్ని ఎదుర్కొంటున్నారనేది సందేశాత్మకంగా ఈ సినిమాలో చూపించబోతున్నాం. ఈ నెలలో కాకినాడలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘నా స్నేహితుడి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నాం. ఓటీటీలో ఈ సినిమాను విడుదలచేయాలనుకుంటున్నాం. ఇందులో నేనూ ఓ కీలక పాత్ర చేస్తున్నా’ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎం.ఎల్. రాజా, కెమెరా: మనోహర్ కొల్లి.