బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్ ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకురానున్నారు. జూన్ 3న హిందీతో పాటు దక్షిణాది భాషల్లో తెరపైకి రాబోతున్నది. డాక్టర్ చంద్రప్రకాష్ ద్వివేది దర్శకుడు. ఈ సినిమా ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నారు అక్షయ్. ఈ సందర్భంగా తన కెరీర్లో జరిగిన ఆసక్తికర ఘటనలూ పంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఒక మహిళా అభిమాని తన కోసం ఇంటి నుంచి పారిపోయిన సంగతి తెలిపారు అక్షయ్. ఆయన మాట్లాడుతూ…‘నన్ను చూడాలని ఒక మహిళా అభిమాని ఇంటి నుంచి పారిపోయి వచ్చింది. ఆ విషయం నాకు ఆలస్యంగా తెలిసింది. ఆమె ఎక్కడికి వెళ్లిందో తెలియదు. ఈ విషయం నా దృష్టికి రాగానే వాళ్ల తల్లిదండ్రులను పిలిచి మాట్లాడాను. ఆ తర్వాత ఆమె క్షేమంగా ఇళ్లు చేరిందని తెలిసింది. అభిమానులను నేను చాలా గౌరవిస్తాను. అయితే మీకూ ఒక వ్యక్తిగత జీవితం ఉంటుందని, మాకంటే దానికే విలువ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తుంటాను’అని చెప్పారు.