Akshay Kumar | బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలలో నటిస్తున్నాడు. ఈయన నటించిన లేటెస్ట్ మూవీ ‘బచ్చన్ పాండే’ మార్చి 18న విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. దీంతో పాటుగా నాలుగు సినిమాలు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. మరో రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ వర్గాల్లో అందుతున్న సమాచారం ప్రకారం ఈయన నటించిన మరో సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కానున్నట్లు తెలుస్తుంది.
అక్షయ్ కుమార్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మిషన్ సిండ్రెల్లా’. తమిళంలో సూపర్ హిట్టయిన ‘రాట్ససన్’ చిత్రానికి రీమేక్గా ఈ చిత్రం తెరకెక్కింది. రంజిత్ తివారి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలోనే విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు జరుపుతున్నారట. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్స్టార్ ఈ చిత్ర హక్కుల కోసం భారీ డీల్ కుదిరించుకుందని సమాచారం. తెలుగులో ఈ చిత్రాన్ని ‘రాక్షసుడు’ టైటిల్తో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించాడు. ఇప్పటికే అక్షయ్ కీలకపాత్రలో నటించిన ‘అర్థంగి రే’ కూడా డైరెక్ట్గా ఓటీటీలో విడుదలైంది. ధనుష్, సారాఅలీఖాన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు.