1971 పాకిస్థాన్తో జరిగిన యుద్ధంలో ధైర్యసాహసాల్ని కనబరచిన భారత ఆర్మీ మేజర్ ఇయాన్ కార్డోజో పాత్రలో బాలీవుడ్ హీరో అక్షయ్కుమార్ నటించబోతున్నారు. ‘గోర్ఖా’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంజయ్పురాణ్ సింగ్ చౌహాన్ దర్శకుడు. ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను ట్విట్టర్ ద్వారా అక్షయ్కుమార్ అభిమానులతో పంచుకున్నారు. ఇందులో ఆర్మీ దుస్తుల్లో కత్తి పట్టుకొని రౌద్రంగా కనిపిస్తున్నారాయన.