Sky Force Movie | ఓ మై గాడ్ చిత్రంతో బాలీవుడ్లో చాలా రోజులకు హిట్ కొట్టాడు స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar). ఈ విజయంతో వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే అక్షయ్ నటించిన మిషన్ రాణిగంజ్(Mission Raniganj) విడుదలకు సిద్దం కాగా.. తాజాగా మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. గాంధీ జయంతి (Gandhi Birth Anniversary), మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి (LB Shastri) జన్మదినం సందర్భంగా.. తన కొత్త ప్రాజెక్ట్ స్కై ఫోర్స్(SKY Force) అనే దేశభక్తి సినిమాలో నటించనున్నట్లు వెల్లడించాడు. దీనికి సంబంధించి ఒక వీడియో విడుదల చేశాడు.
1965లో ఇండియా పాకిస్తాన్ వార్ నేపథ్యంలో ఈ సినిమా రానుండగా.. ఈ వీడియోలో సినిమా లోగోతో పాటు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఇండియా పాకిస్తాన్ వార్ సమయంలో మాట్లాడిన ప్రసంగం వినిపిస్తుంది. ఈ సినిమాను అక్టోబర్ 02 2024 లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇక వీర్ పహారియా ఈ చిత్రంలో కీలక పాత్రలో తెరంగేట్రం చేయనున్నారు. దినేష్ విజన్, జ్యోతి దేశ్పాండే నిర్మిస్తున్న ‘స్కై ఫోర్స్’ చిత్రానికి సందీప్ కెల్వానీ, అభిషేక్ కపూర్ సంయుక్తంగా దర్శకత్వం వహించనున్నారు. ఇక ఈ సినిమాలో సారా అలీ ఖాన్, నిమృత్ కౌర్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
आज गांधी-शास्त्री जयंती के दिन सारा देश कह रहा है – जय जवान, जय किसान, जय विज्ञान, जय अनुसंधान. No better day than today to announce the incredible story of #SkyForce: Our untold story of India’s first and deadliest airstrike.
Give it love, please. Jai Hind, Jai Bharat. 🇮🇳… pic.twitter.com/qrxQrVqVNB
— Akshay Kumar (@akshaykumar) October 2, 2023
మరోవైపు.. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మిషన్ రాణిగంజ్(Mission Raniganj). ది గ్రేట్ భారత్ రెస్క్యూ అనేది ఉప శీర్షిక (The Great Bharat Rescue). బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా (parinithi chopra) కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా అక్టోబర్ 06న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.