Akshay Kumar | బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మహర్షి వాల్మీకి పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఒక ఏఐతో సృష్టించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో ప్రేక్షకులు అక్షయ్ నిజంగానే వాల్మీకి పాత్రలో నటించబోతున్నాడు అనుకుంటున్నారు. అయితే వార్తలతో పాటు ఆ వీడియో అక్షయ్ స్పందిస్తూ.. అది నకిలీదని, దీనిని AI ద్వారా సృష్టించారని అక్షయ్ కుమార్ స్పష్టం చేశారు. కొన్ని వార్తా సంస్థలు ఈ నకిలీ వీడియోలను నిజమైన వార్తగా ప్రచురించడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు.
మహర్షి వాల్మీకి పాత్రలో నేను నటిస్తున్నట్లు వస్తున్న వీడియోలు అన్నీ ఫేక్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి వీటిని సృష్టించారు. కొంతమంది న్యూస్ ఛానెల్స్ కనీసం నిజానిజాలు నిర్ధారించుకోకుండానే వీటిని వార్తలుగా ప్రసారం చేయటం ఇంకా దారుణం అని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. అంతేగాకుండా ప్రస్తుత కాలంలో మోసపూరిత కంటెంట్ AI ద్వారా వేగంగా సృష్టించబడుతున్నందున, మీడియా సంస్థలు సమాచారాన్ని ధృవీకరించిన తర్వాతే ప్రచురించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
I have recently come across some AI-generated videos of a film trailer showing me in the role of Maharishi Valmiki. I want to clarify that all such videos are fake and created using AI. What’s worse, some news channels decide to pick these up as ‘news’ without even verifying if…
— Akshay Kumar (@akshaykumar) September 23, 2025