అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటిస్తున్న సినిమా ‘బడే మియా ఛోటే మియా’. గతంలో అమితాబ్ బచ్చన్, గోవిందా కలిసి నటించిన సూపర్ హిట్ సినిమా పేరుతోనే ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు అలీ అబ్బాస్ జఫర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వసూ భగ్నానీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉందీ సినిమా.
తాజాగా సోషల్ మీడియా ద్వారా ఈ సినిమాలోని కొత్త స్టిల్ను హీరో అక్షయ్ కుమార్ విడుదల చేశారు. ఈ ఫొటోలో యుద్ధ విమానం నుంచి ఇద్దరు హీరోలు రైఫిల్స్తో పోరాటం చేస్తున్న సన్నివేశం ఉంది. అక్షయ్, టైగర్ ష్రాఫ్ ఇద్దరికీ యాక్షన్ హీరోలుగా మంచి పేరుంది. ఈ సినిమాలోనూ ఫైట్ సీక్వెన్సులు ప్రధానాకర్షణ కానున్నాయి. వచ్చే ఏడాది వేసవికి హిందీతో పాటు దక్షిణాది భాషల్లో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈద్ పండక్కి థియేటర్స్లో కలుద్దాం అంటూ అక్షయ్ ఇన్స్టాలో పోస్ట్ చేశారు.