అక్షయ్కుమార్, రితేష్ దేశ్ముఖ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘హౌస్ఫుల్’ సిరీస్ చిత్రాలకు బాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. ఆద్యంతం చక్కటి వినోదంతో ఈ సినిమాలు ప్రేక్షకుల్ని అలరించాయి. ఈ ఫ్రాంఛైజీలో భాగంగా ‘హౌస్ఫుల్-5’ రాబోతున్నది. ఐదు భాగాలుగా తెరకెక్కించిన తొలి భారతీయ సినిమా ఇదే కావడం విశేషం.
ఈ సిరీస్లో ఐదో చిత్రాన్ని వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయబోతున్నట్లు అక్షయ్కుమార్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘హౌస్ఫుల్-5’ చిత్రానికి తరుణ్ దర్శకత్వం వహించబోతున్నారు. సాజిద్ నదియావాల నిర్మాత. తొలి నాలుగు భాగాల్లో నటించిన ప్రధాన తారలు చాలా మంది ఈ ఐదో భాగంలో నటించనున్నారని సమాచారం. ‘హౌస్ఫుల్-5’లో ఐదింతల వినోదం ఉంటుందని అక్షయ్కుమార్ ట్విట్టర్లో పేర్కొన్నారు.