Akkineni Nagarjuna | కింగ్ నాగార్జునకు గత కొంత కాలంగా సరైన హిట్టు లేదు. ‘సోగ్గాడే చిన్ని నాయన’ తర్వాత ఇప్పటివరకు ఈయనకు సోలో హిట్ లేదు. హిట్ సంగతి పక్కన పెట్టు, ఈయన సినిమాలు కనీసం బడ్జెట్లో సగం కూడా రికవరీ చేయలేకపోతున్నాయి. సోగ్గాడే తర్వాత ఆయన సోలోగా చేసిన ‘ఓం నమో వేంకటేశాయ’, ‘ఆఫీసర్’, ‘మన్మధుడు-2’ సినిమాలు కనీసం ఒక వారం కూడా థియేటర్లలో ప్రదర్శితం కాలేకపోయాయి. గతేడాది విడుదలైన ‘వైల్డ్ డాగ్’.. ఆ ముందు సినిమాలతో పోలిస్తే కొంచెం బెటర్గా పర్ఫార్మ్ చేసింది. ఈ ఏడాది ‘బంగార్రాజు’తో హిట్ అందుకున్న అందులో సగం క్రెడిట్ నాగచైతన్యకు దక్కుతుంది.
ఈ క్రమంలో బాగా కష్టపడి చేసిన ‘ది ఘోస్ట్’ కూడా నాగార్జునకు నిరాశే మిగిల్చింది. దసరా కానుకగా రిలీజైన ఈ చిత్రం మొదటి రోజు నుండి డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయిన కింగ్.. ఇప్పుడు వరుస ఫ్లాప్లతో సతమతవుతున్నాడు. ఈ నేపథ్యంలో నాగ్ తన తదుపరి సినిమాలను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడట. ఇందులో భాగంగానే పలువురు దర్శకులు, రచయితలతో చర్చలు జరుపుతున్నారట. ఇదిలా ఉంటే నాగ్ తన తర్వాతి సినిమాను గాడ్ఫాదర్ దర్శకుడు మోహన్ రాజాతో చేయనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అఖిల్ కూడా ఈ సినిమాలో భాగమువుతున్నాడని వినిపించాయి. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్ లేదు.
‘గాడ్ఫాదర్’ రిజల్ట్తో నాగ్ వెనక్కు తగ్గాడా అనే వార్తలు కూడా గత కొన్ని రోజులుగా వస్తున్నాయి. దీనిపై క్లారిటీ రాకముందే నాగ్, ప్రముఖ రచయిత ప్రసన్న కుమార్ బెజవాడను దర్శకుడిగా పరిచయం చేస్తున్నట్లుగా టాలీవుడ్లో గుస గుసలు వినిపించాయి. మలయాళంలో సూపర్ హిట్టయిన ‘పురంజు మరియం జోస్’ రీమేక్ భాద్యతలు ప్రసన్న కుమార్కు అప్పగించినట్లు తెలుస్తుంది. దీంతో పాటుగా విక్రమ్ కే. కుమార్ను కూడా లైన్లో పెట్టినట్లు తెలుస్తుంది. ‘థాంక్యూ’తో కొడుకుకు డిజాస్టర్ ఇచ్చినా.. మనం వంటి మెమొరబుల్ సినిమాను ఇచ్చిన దర్శకుడిగా అతని మీద నాగార్జునకు పూర్తి నమ్మకం ఉందట.
వీటితో పాటుగా ఓ పీరియాడిక్ సినిమాను కూడా ప్లాన్ చేసినట్లు సమాచారం. మరీ ఇందులో ఏది ముందుగా పట్టాలెక్కనుందో తెలియాలుంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. సినిమాల విషయం ఇలా ఉంటే బిగ్బాస్ సీజన్-6 కూడా నాగార్జునకు కలిసి రావట్లేదు. ముందు సీజన్లతో పోలిస్తే ఈ సీజన్కు ప్రేక్షకుల నుండి ఆదరణ కరువైందట.