Samantha Rutu Prabhu | స్టార్ హీరోయిన్ సమంత తాజాగా వయోసైటిస్ వ్యాధితో భాదపడుతున్నట్లు సోషల్మీడియాలో ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా గత కొన్ని రోజులుగా సమంత కాస్మోటిక్ సర్జరీ చేయించుకుందని వార్తలు వచ్చాయి. అందువల్లే సమంత ఇదివరకులాగా సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉండటం లేదని, ఎలాంటి ఫోటోలు షేర్ చేయడం లేదని జోరుగా ప్రచారం జరిగింది. దానికి తోడు సమంత ఇటీవలే ఓ యాడ్ షూట్లో భాగంగా రిలీజైన ఫోటోలు కూడా మార్పులు కనిపించడంతో వార్తలు మరింత ఊపందుకున్నాయి. కాగా ఈ వార్తలపై తాజాగా సమంత స్పందించింది.
సమంత తాజాగా తనకు వచ్చిన వ్యాధి గురించి సోషల్మీడియాలో అభిమానులతో పంచుకుంది. తను వయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పింది. అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం నిలికడగానే ఉందని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు తెలిపింది. ఓ వైపు చికిత్స తీసుకుంటేనే మరో వైపు యశోద డబ్బింగ్ చెబుతున్న ఫోటోను సామ్ ఇన్స్టాలో షేర్ చేసింది. కాగా ఈ పోస్ట్పై జూ.ఎన్టీఆర్, రాశీఖన్నా, జాన్వీ కపూర్ ఇలా పలువురు సినీ ప్రముఖులు సమంత త్వరగా కోలుకోవాలని పోస్ట్లు పెడుతున్నారు. కాగా తాజాగా అఖిల్ ఈ సమంత పోస్ట్పై స్పందించి ‘అందరి ప్రేమాభిమానాలే నీకు మరింత బలాన్నిస్తాయి డియర్ సామ్’ అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఇప్పటివరకు అక్కినేని నాగార్జున గానీ, నాగచైతన్య గానీ ఈ విషయంపై స్పందించలేదు.
ఇక సమంత తాజాగా నటించిన యశోదా రిలీజ్కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్, హరీష్ నారాయణ్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. వరలక్ష్మీ శరత్కుమార్, ఉన్నీ ముకుందన్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో నవంబర్ 11న రిలీజ్ కానుంది.