నందమూరి బాలకష్ణకు ఎంత మాస్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా విడుదలైంది అంటే థియేటర్స్లో రచ్చ మాములుగా ఉండదు. పండగ వాతావరణం తలపించేలా సందడి చేస్తుంటారు అభిమానులు. తాజాగా ఆయన బోయపాటి దర్శకత్వంలో రూపొందిన అఖండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా పాజిటివ్ టాక్తో దూసుకు పోతుంది.
చిత్రంలో బాలయ్య విశ్వరూపం చూపించారని, మాస్ జాతర అంటూ థియేటర్ల వద్ద ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. సెలబ్రేషన్స్తో హంగామా సృష్టిస్తున్నారు. మన దేశంలోనే కాదు విదేశాలలోను ఇదే పరిస్థితి నెలకొంది. ఆస్ట్రేలియాలోని ఓ థియేటర్లో బాలయ్య అభిమానులు కొన్ని సన్నివేశాలు వచ్చినప్పుడు తెగ రచ్చ చేశారట. దీంతో థియేటర్ యజమానులు మూవీ ఆపేసి మరీ మైకులో వార్నింగ్ ఇచ్చారట. అయినా బాలయ్య అభిమానులు ఏమాత్రం తగ్గకపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారట. షో ఆపేసి వార్నింగ్ ఇచ్చి వెళ్లారట.
‘సింహా’, ‘లెజెండ్’ వంటి సూపర్ హిట్ల తర్వాత బోయపాటి- బాలయ్య కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. మిర్యాల రవీందర్రెడ్డి నిర్మించారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ సందడి చేయనుంది. జగపతిబాబు, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించారు.