Ajith-Vignesh shivan Movie | తమిళ స్టార్ అజిత్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. గొల్లపూడి మారుతిరావు దర్శకత్వం వహించిన ‘ప్రేమ పుస్తకం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయిన అజిత్ ‘వాలి’, ‘ప్రియురాలు పిలిచింది’, ‘గ్యాంబ్లర్’ వంటి సినిమాలతో తెలుగులో మంచి క్రేజ్ ఏర్పరుచుకున్నాడు. ఈయన నటించిన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతుంటాయి. ప్రస్తుతం ఈయన నటించిన తునివు రిలీజ్కు సిద్ధంగా ఉంది. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో షూటింగ్ మొదలుపెట్టనుంది.
ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. ఈ మూవీ డిజిటల్ హక్కులను నెట్ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసిందని సమాచారం. అన్నీ భాషలకు కలుపుకుని దాదాపు రూ.65 కోట్లకు డీల్ కుదిరికున్నట్లు సమాచారం. ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందే ఈ రేంజ్లో బిజినెస్ జరిగిందంటే విశేషం అనే చెప్పాలి. మధురై విలేజ్ బ్యాక్ డ్రాప్ కథతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు టాక్. అజిత్కు జోడీగా త్రిష నటించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది.