అందాల తార ఐశ్వర్యారాయ్ మరో తమిళ చిత్రంలో కనిపించబోతున్నది. అజిత్ హీరోగా నటిస్తున్న 62వ చిత్రంలో నాయికగా ఆమెను ఎంపిక చేసినట్లు కోలీవుడ్ సమాచారం. అజిత్, ఐశ్వర్యా గతంలో ‘ప్రియురాలు పిలిచింది’ అనే చిత్రంలో జంటగా నటించారు. ఇరవై మూడేండ్ల తర్వాత మళ్లీ వీరిద్దరు కలిసి నటిస్తుండటం విశేషం. ఈ సినిమాలో అరవింద్ స్వామి విలన్ పాత్రను పోషిస్తున్నారు.
ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తుండగా…విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో చిత్రీకరణ ప్రారంభించి ఈ ఏడాది దీపావళి పండక్కి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. 2018లో ‘ఫానే ఖాన్’ సినిమా తర్వాత ఐశ్వర్యా బాలీవుడ్ నుంచి బ్రేక్ తీసుకుంది. గతేడాది ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాలో ప్రధాన పాత్రలో నటించి ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తెచ్చిన క్రేజ్తోనే ఆమెకు కోలీవుడ్లో బిగ్ ఆఫర్స్ వస్తున్నాయి. త్వరలో ‘పొన్నియన్ సెల్వన్ 2’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నది.