కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) ఇటీవలే తునివు సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడని తెలిసిందే. హెచ్ వినోథ్ దర్శకత్వంలో హీస్ట్ థ్రిల్లర్గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్తో స్క్రీనింగ్ అవుతోంది. తునివు తెలుగులో తెగింపు టైటిల్తో విడుదలైంది. తమిళనాడులో నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.
కాగా ఇపుడు అజిత్ అభిమానుల్లో జోష్ నింపే మరో అప్డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఏకే 62 (AK 62)కు సంబంధించిన వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai Bachchan) లాంగ్ గ్యాప్ తర్వాత అజిత్తో కలిసి నటించబోతుందన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. అన్నీ కుదిరితే ఏకే 62లో ఐష్ ఫీ మేల్ లీడ్ రోల్లో కనిపించడం ఖాయమైనట్టే.
అజిత్, ఐశ్వర్యరాయ్ కాంబినేషన్లో 2000 సంవత్సరంలో ప్రియురాలు పిలిచింది సినిమా వచ్చింది. ఈ ఇద్దరు మళ్లీ 22 ఏండ్ల తర్వాత కలిసి నటించబోతున్నారన్న వార్తను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్. మరి రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ ఏమైనా వస్తుందేమో చూడాలంటున్నారు సినీ జనాలు.