Simbu-Aiashwarya movie | తమిళ హీరో ధనుష్, ఐశ్వర్య విడాకుల తర్వాత ఎవరి లైఫ్లో వారు బిజీగా గుడుపుతున్నారు. ప్రస్తుతం వీరి ఫోకస్ మొత్తం సినిమాలపైనే పెట్టారు. ధనుష్ లేటెస్ట్ చిత్రం ‘మారన్’ నేరుగా శుక్రవారం నుంచి హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో పాటుగా ‘నానేవరువన్’, ‘తిరుచిరంబలం’, ‘సర్’, ‘ద గ్రే మ్యాన్ ఇన్ ఇజ్ కిట్టి’ సినిమాలలో నటిస్తున్నాడు. ఇక సౌందర్య కూడా మళ్లీ మెగా ఫోన్ పట్టడానికి సిద్ధమైంది. ‘3’, ‘వయ్ రాజ వయ్’, ‘విఐపి-2’ సినిమాలకు సౌందర్య దర్శకత్వం వహించింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తమిళ స్టార్ శింబుతో తన తరువాతి సినిమాను చేయనున్నట్టు టాక్.
‘మానాడు’ సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన శింబు వరుసగా సినిమాలను చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘వెండు తానింతడు కాదు’,’ పాట్టు తలై’, ‘కరోనా కుమార్’ సినిమాలలో నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఐశ్వర్య, శింబుకు ఒక యాక్షన్ థ్రిల్లర్ కథను వినిపించిందట. దానికి శింబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఈ చిత్రం నుంచి అధికారికంగా ప్రకటన రానున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. గతంలో శింబు, ఐశ్వర్య కలిసి ‘విజిల్’ సినిమాలో ‘నాట్పే’ సాంగ్ను ఆలపించారు.