Actress Aishwarya Rajesh | గ్లామర్ పాత్రలకు అతీతంగా, కేవలం నటనకు ప్రధాన్యమున్న పాత్రలు పోషిస్తూ తమిళనాట విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది ఐశ్వర్య రాజేష్. సినిమాల్లోకి రావాలంటే రంగు ఏమాత్రం అడ్డు కాదని, నటిన వస్తే చాలని నిరూపించింది ఈ తమిళ సోయగం. మూడేళ్ల క్రితం వచ్చిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఐశ్వర్య రాజేష్. తొలి సినిమాతోనే తిరుగులేని గుర్తింపు తెచ్చుకుంది. సువర్ణ పాత్రలో జీవించింది. పైగా తెలుగు మూలాలున్న అమ్మాయి కావడంతో టాలీవుడ్ ప్రేక్షకులు ఈ బ్యూటీని తెగ ఆదరించారు. ఇక ఇదిలా ఉంటే ఈ అమ్మడు తాజాగా రష్మికపై చేసిన కామెంట్స్ నెట్టింట దుమారం రేపుతున్నారు.
పుష్ప సినిమాతో రష్మికకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అయితే కొందరు మాత్రం రష్మిక శ్రీవల్లి పాత్రకు సెట్ కాలేదని, చిత్తూరు స్లాంగ్ ఆమె పట్టి పట్టి చెప్పిందని కామెంట్స్ వినిపించాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఐశ్వర్య రాజేష్ పుష్పలో శ్రీవల్లి పాత్ర రష్మిక కంటే నేను బాగా చేశానని సంచలన వ్యాఖ్యలు చేసింది. రీసెంట్గా జరిగిన ఓ ఇంటర్వూలో ఐశ్వర్య టాలీవుడ్ అంటే నాకు చాలా ఇష్టం. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో నేను తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాను అని చెప్పింది. ఇక నాకు పుష్ప సినిమాలో శ్రీవల్లి అనే డీ గ్లామరస్ పాత్ర బాగా సూట్ అయ్యేది. రష్మిక కంటే నేను ఆ పాత్రను బాగా చేసేదాన్ని అంటూ వెల్లడించింది.
పుష్ప సినిమాలో రష్మిక బాగా చేయలేదా? అని యాంకర్ అడగ్గా.. ఆమె బాగా చేయలేదని అనడం లేదని, తనైతే ఆ పాత్రకు కరెక్ట్ అని అభిప్రాయపడినట్లు తెలిపింది. దాంతో ప్రస్తుతం ఈ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఐశ్వర్య నటించిన ఫర్హానా మూవీ శుక్రవారం రిలీజై పాజిటీవ్ టాక్తో దూసుకుపోతుంది.