Aishwarya Rai Bachchan| జీన్స్ సినిమాతో సిల్వర్ స్క్రీన్పై మెరిసి సూపర్ ఫేం సంపాదించుకుంది ఐశ్వర్యారాయ్ (Aishwarya Rai Bachchan). ఈ భామ ఐష్ నుంచి ఐశ్వర్యారాయ్ బచ్చన్గా మారి 17 ఏండ్లు అవుతోంది. ఈ భామ అమితాబ్బచ్చన్-జయా బచ్చన్ కోడలిగా.. అభిషేక్ బచ్చన్ సతీమణిగా సుదీర్ఘ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తోంది. శనివారం ఐష్-అభిషేక్ 17వ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా తన భర్త అభిషేక్ బచ్చన్, ముద్దుల కూతురు ఆరాధ్య బచ్చన్తో కలిసి సెల్ఫీ దిగి.. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది.
స్టార్ కపుల్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. నెట్టింటిని కామెంట్స్, సందేశాలతో నింపేశారు ఫాలోవర్లు, అభిమానులు, నెటిజన్లు. ఈ సెల్ఫీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఐశ్వర్యారాయ్ చివరగా మణిరత్నం మాగ్నమ్ ఓపస్ పొన్నియన్ సెల్వన్ ప్రాంఛైజీలో నందినీ పాత్రలో నటించింది. ఈ ఎపిక్ పీరియడ్ యాక్షన్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్గా విడుదలై నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కించాయి.
ఐశ్వర్యారాయ్ బచ్చన్ ఫ్యామిలీ సెల్ఫీ..
#AishwaryaRaiBachchan shares the perfect family selfie with #AbhishekBachchan and their daughter #AaradhyaBachchan on their wedding anniversary. ❤️ pic.twitter.com/vga1ZotePS
— Filmfare (@filmfare) April 21, 2024