దుల్కర్ సల్మాన్, ఐశ్వర్యలక్ష్మీ జంటగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కింగ్ ఆఫ్ కోథా’. ఈ నెల 24న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఐశ్వర్య లక్ష్మీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘ఇంత భారీ సినిమాలో భాగం కావడం నాకు ఇదే తొలిసారి.
ఈ చిత్రంలో నా పాత్ర పేరు తార. దుల్కర్ పేరు రాజు. మా ఇద్దరి మధ్య అందమైన లవ్స్టోరీ కూడా వుంది. చాలా ఆసక్తికరమైన సినిమా ఇది. ఈ లవ్స్టోరీకి బ్రిలియంట్ మ్యూజిక్ ట్రాక్ వుంటుంది. తప్పకుండా ఈ చిత్రం నాకు మంచి పేరును తీసుకువస్తుంది. కథానాయికగా అన్ని రకాల పాత్రలను చేయాలని వుంది. దసరా సినిమాలో కీర్తి సురేష్ పాత్ర నాకు చాలా ఇష్టం. అలాంటి పాత్ర చేయాలని వుంది’ అని చెప్పింది.