కీర్తి కృష్ణ, నిఖిత, మధుబాల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ఏజెంట్ నరసింహా 117’. షాయాజీ షిండే, ప్రదీప్ రావత్, దేవ్గిల్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవ్యసాయి ఫిలింస్ పతాకంపై బి. నరసింహారెడ్డి నిర్మాణంలో దర్శకుడు లక్ష్మణ్ చాప్రాల రూపొందిస్తున్నారు.
ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం తాజాగా హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత బి. నరసింహారెడ్డి మాట్లాడుతూ..‘మాస్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని నిర్మించాం. నేనే కథను అందించాను. ప్రేక్షకులను అలరించే అనేక అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : స్వర్గీయ జయరాం, ఎడిటింగ్ : మేనేజ్ శ్రీను, సంగీతం : రాజ్ కిరణ్.