Akkineni Akhil | తొమ్మిదేళ్ల క్రితం మనం అనే సినిమాలో అఖిల్ గెస్ట్ రోల్కే అక్కినేని ఫ్యాన్స్ ఊగిపోయారు. ఆ తర్వాతి ఏడాది అఖిల్ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నా.. ఒక డెబ్యూ హీరోకు ఆ రేంజ్ సెలబ్రేషన్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే రీతిలో జరిగాయి. అయితే ఎంత కాదన్నా ఎన్నో ఆశలతో థియేటర్కు వచ్చిన అక్కినేని అభిమానులను మాత్రం ఈ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. ఆ తర్వాత హలో పర్వాలేదనిపించినా, కమర్షియల్ ఫేయిల్యూర్గా మిగిలింది. ఇక మిస్టర్ మజ్ను అయితే అక్కినేని ఫ్యాన్స్కు కూడా చిరాకు తెప్పించింది. కాస్తో కూస్తో అఖిల్కు పేరుతెచ్చిపెట్టింది మాత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్. రెండేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా అఖిల్కు తొలిహిట్. అయినా కానీ ఫ్యాన్స్లో ఏదో అసంతృప్తి.
అక్కినేని ఫ్యాన్స్కు అది సరిపోలేదు. దాంతో అఖిల్ తనను తాను పూర్తిగా మేకోవర్ చేసుకుని ఏజెంట్ సినిమాతో వస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ మూవీలో అఖిల్ రా ఏజెంట్గా కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా రిలీజైన ట్రైలర్ కూడా ఆహా ఓహో అనే రీతిలోనే ఉంది. హాలీవుడ్ స్టంట్స్కు ఏ మాత్రం తీసిపోని విధంగానే ఉంది. ఇక ఎన్నో వాయిదాల తర్వాత ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదంతా బాగానే ఉంది సరే కానీ ఈ సినిమా ఖర్చు వింటేనే అబ్బో అనిపిస్తుంది. అఖిల్మార్కెట్ పాతికకోట్లు మాత్రమే. అది కూడా మొన్న వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్తో అది సాధ్యమైంది. అంతకు ముందు అఖిల్ సినిమాలు రూ.20 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయాయి. అలాంటిది ఏంజెంట్ సినిమాకు దాదాపు రూ.80 కోట్లు ఖర్చయిందట. ఇటీవలే ఈ సినిమా ప్రొడ్యూసర్ అనీల్ సుంకర ఓ ఇంటర్వూలో తెలిపాడు. సినిమా స్టార్టింగ్లో బడ్జెట్ సుమారు రూ.50 కోట్లు అన్నట్లు ప్రచారం చేశారు. అప్పట్లోనే అఖిల్ లాంటి హీరోపై రూ.50కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే సాహసమనే చెప్పాలంటూ పలువురు అభిప్రాయపడ్డారు.
అయితే యాక్షన్ సినిమా.. అందులోనూ సురేందర్ రెడ్డి వంటి స్టైలిష్ డైరెక్టర్ చేతిలో ఈ ప్రాజెక్ట్ ఉండటంతో బడ్జెట్ బ్యాలెన్స్ అయిందని అనిపించింది. అయితే ఇప్పుడు రూ.80 కోట్లు దాటిందంటే అందరికీ షాకింగ్ గానే ఉంది. సినిమాపై హైప్ చూస్తే ఏమంత మాత్రంగానూ లేదు. పైగా సినిమాను కొనడానికి బయ్యర్లు కూడా ఆసక్తి చూపడం లేదట. దాంతో చాలా ఏరియాల్లో సినిమాను ఓన్ రిలీజ్ చేసుకుంటున్నారట. ఇక ఇప్పుడు ఈ సినిమా భారం మొత్తం అఖిల్ పైనే ఉంది.
భీభత్సమైన టాక్ తెచ్చుకున్న దసరా సైతం రూ.120 కోట్ల దగ్గరే ఆగిపోయింది. అలాంటిది అఖిల్ సినిమా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ను కలెక్ట్ చేయాలంటే పాజిటీవ్ టాక్తో పాటు కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి. ఎందుకంటే ఈ సినిమా వారం రోజులు ముందు విరూపాక్ష రిలీజవుతుంది. ఈ సినిమాకు మరీ హైప్ లేదు కానీ, సుక్కు కథ అందించిన సినిమా కావడంతో కాస్త పాజిటీవ్ టాక్ వచ్చినా రెండు వారాల రన్ ఖచ్చితంగా ఉంటుంది. నాన్-థియేట్రికల్ హక్కులకు 30కోట్లు తీసేసినా..50 కోట్ల షేర్ అయితే ఏజెంట్ ఖచ్చితంగా సాధించాల్సి ఉంటుంది. మరీ ఇన్ని అడ్డంకులను తట్టుకుని ఏజెంట్ హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి.