ధనుష్, శృతి హాసన్ జంటగా నటించిన సినిమా ‘3’. 2012లో ఈ సినిమా విడుదలైంది. మరోసారి ఈ చిత్రాన్ని తెలుగు రాష్ర్టాల్లో విడుదల చేస్తానని చెబుతున్నారు నిర్మాత నట్టి కుమార్. ఇవాళ పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. నట్టికుమార్ మాట్లాడుతూ..‘ధనుష్, శృతి హాసన్ నటించిన ‘3’ సినిమా కొలవెరి పాటతో సంచలనం సృష్టించింది.
పదేళ్ల క్రితం ఈ సినిమాను తెలుగు, తమిళంలో నేనే విడుదల చేశాను. మళ్లీ తాజాగా ఈ సినిమా తెలుగులో రిలీజ్ చేయబోతున్నా. నిర్మాతగా, ఎగ్జిబిటర్గా, డిస్ట్రిబ్యూటర్గా తెలుగు సినీ పరిశ్రమలో నా ప్రస్థానం కొనసాగుతున్నది. 30 ఏళ్లుగా ఈ పరిశ్రమలో ఆటుపోట్లు ఎదుర్కొని నిలదొక్కుకున్నాను’ అన్నారు.