Akkineni Nagarjuna | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నాగార్జున ప్రస్తుతం ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కుబేర’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం జూన్ 20న విడుదల కానుంది. అలాగే, సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కూలీ’లోనూ నాగార్జున ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ఈ రెండు భారీ ప్రాజెక్ట్లలో నటిస్తున్న నాగార్జున తదుపరి చిత్రంపై సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, నాగార్జున ఇటీవల ఒక యువ తమిళ దర్శకుడు చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. తమిళ దర్శకుడు ‘నిథం ఓరు వానమ్’ (తెలుగులో ఆకాశం) సినిమా ఫేం కార్తీక్ నాగ్కి కథ వినిపించినట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై చిత్ర నిర్మాతలు ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది. రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఒకవైపు వరుస చిత్రాలతో బిజీగా ఉన్న నాగార్జున, మరోవైపు యువ దర్శకులతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతుండటం ఆయన అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. కార్తీక్ వంటి ప్రతిభావంతుడైన దర్శకుడితో నాగార్జున జత కడితే ఎలాంటి సినిమా వస్తుందో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.