Ae Watan Mere Watan | బాలీవుడ్ నటి సారా అలీఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఏ వతన్ మేరే వతన్.() ఈ సినిమాకు కణ్ణన్ అయ్యర్ దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే ఈ సినిమాను మొదట సెప్టెంబర్ 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అనుకోని కారణాల వల్ల వాయిదాపడింది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో అప్డేట్ను ఇచ్చారు మేకర్స్. ఈ మూవీని థియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను ఈ సినిమాను వరల్డ్ రేడియో డే సందర్భంగా మార్చి 21 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి ఒక గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. క్విట్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో కమ్యూనిటి రేడియో స్టేషన్లను ఏర్పాటు చేసి.. ఉద్యమకారుల్లో ఉత్తేజం నింపిన ఉషా మెహతా అనే మహిళ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రానున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మి, సచిన్ ఖేడ్కర్, అభయ్ వర్మ, స్పార్ష్ శ్రీవాత్సవ, అలెక్స్ ఓ నేలి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
resilience in her voice, and the spirit of freedom in her heart, hear what she has to say to you this #WorldRadioDay 📻#AeWatanMereWatanOnPrime, Mar 21#KaranJohar @apoorvamehta18 @somenmishra0 @SaraAliKhan #KannanIyer @darab_farooqui @Dharmatic_ pic.twitter.com/ZdQvDsFLjH
— prime video IN (@PrimeVideoIN) February 13, 2024