గల్ఫ్ దేశం కేవలం పెట్రో ఉత్పత్తులపై ఆధారపడకుండా రియల్ ఎస్టేట్ పర్యాటక రంగం, ఇతర వినోద రంగాలకు పెద్దపీట వేస్తూ అన్ని దేశ ప్రజలను అమితంగా ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో ప్రముఖులకు ఫ్యామిలీ గోల్డెన్ వీసా అందజేస్తూ వారి ఆదరాభిమానాలను చూరగొంటోంది. 2019 నుంచి ఈ గోల్డెన్ వీసాలు అందిస్తూ వస్తుండగా, కొద్ది రోజుల క్రితం నటి త్రిషని ఈ అదృష్టం వరించింది. యూఏఈ నుంచి గోల్డెన్ వీసా అందుకున్న తొలి నటిని తానే కావడం ఆనందంగా ఉందంటూ మురిసిపోయింది త్రిష.
తాజాగా ప్రముఖ నిర్మాత బోనీకపూర్ కుటుంబానికి తాజాగా దుబాయ్ ప్రభుత్వం గోల్డెన్ వీసాలు జారీ చేసింది. దుబాయ్ కు రెగ్యులర్ గా వచ్చే బోనీకపూర్ ఫ్యామిలీకి ఈ సదావకాశాన్ని కల్పించింది. ఈ సంవత్సరం బోనీకపూర్ తోపాటు తన నలుగురు పిల్లలకు ఈ వీసా మంజూరు చేిసంది. ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా బోనీ కపూర్ కూతుళ్లు జాన్వీ ఖుషీ కపూర్ తో కలిసి వీసాలను అందుకున్నారు. దుబాయ్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా బోనీ కపూర్ ఫ్యామిలీ ధన్యవాదాలు తెలిపారు.