SeshEXShruti | టాలీవుడ్లో ఉన్న యంగ్ డైనమిక్ హీరోల్లో ఒకరు అడివిశేష్ (AdiviSesh). క్షణం, గూడఛారి, మేజర్, హిట్ 2 సినిమాలతో హీరోగా తనకంటూ సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ క్రేజీ హీరో కాంపౌండ్ నుంచి ఇప్పటికే గూఢచారి 2 వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అడివిశేష్ కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన ఒకటి బయటకు వచ్చింది. ఈ సారి లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ప్రేమ.. దాని వెనకున్న యూనిక్ స్టోరీని మీ ముందుకు తీసుకొచ్చేందుకు అడివిశేష్, శృతిహాసన్ కలిసి వస్తున్నారు.. నయా సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుండగా.. ఆసియన్ సునీల్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి ShaneilDeo కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. మొత్తానికి చాలా కాలం తర్వాత అడివిశేష్ నుంచి లవ్ ట్రాక్ రాబోతుండటంతో అంతా ఆసక్తి నెలకొంది. SeshEXShruti (వర్కింగ్ టైటిల్)తో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
శశి కిరణ్ టిక్కా దర్శకత్వంలో వచ్చిన ‘గూఢచారి’ చిత్రానికి సీక్వెల్గా వస్తుంది ‘జీ2’ (G2). ఈ చిత్రానికి వినయ్ కుమార్ దర్శకత్వం వహిస్తు్న్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైనట్లు తెలియజేస్తూ అడివి శేష్.. ‘జీ2’ (G2) నుంచి ప్రీ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ సీక్వెల్ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
#SeshEXShruti@AdiviSesh and @shrutihaasan are joining hands to bring a unique story of love and beyond ❤️🔥
Produced by #SupriyaYarlagadda under @AnnapurnaStdios & co-produced by @AsianSuniel.
The film is Directed & Co-written by #ShaneilDeo.
More details soon! pic.twitter.com/EI6tHUAORW
— BA Raju’s Team (@baraju_SuperHit) December 12, 2023