పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రానా దగ్గుబాటి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందిస్తున్నారు. మాతృకతో పోల్చితే ఈ సినిమాలో పవన్ ఇమేజ్ కు అనుగుణంగా కొన్ని సన్నివేశాల్లో కీలక మార్పులు చేశారని తెలుస్తోంది. జనవరి 12వ తేదీన చిత్రం విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్లో భాగంగా కొద్ది సేపటి క్రితం అడవితల్లి మాట అంటూ సాగే పాటను విడుదల చేయగా, ఈ పాట అలరిస్తుంది.
పాటలో ఒక పక్క లిరిక్స్తో పాటు మరోవైపు పవన్, రానాల విజువల్స్ హైలైట్ గా కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో పవర్ స్టార్ సరసన నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే రానాకు జోడీగా మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ కనిపించనుంది. ప్రముఖ నటులు, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి, చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. దాదాపు 5.04 కోట్ల రూపాయలకు ప్రముఖ సంస్థ ఆదిత్య మ్యూజిక్ కొనుగోలు చేసినట్లు సమాచారం. రానా దగ్గుబాటి ఈ సినిమాలో డేనియల్ శేఖర్ పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.