‘వార్-2’ చిత్రం ద్వారా ఎన్టీఆర్ బాలీవుడ్లో అరంగేట్రం చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ యాక్షన్ థ్రిల్లర్లో ఆయన బాలీవుడ్ అగ్ర హీరో హృతిక్ రోషన్తో తెరను పంచుకోబోతున్నారు. ఈ చిత్రాన్ని యష్రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా తెరకెక్కించబోతున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు. నవంబర్లో ఈ సినిమా సెట్స్మీదకు వెళ్లనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని 2025 రిపబ్లిక్డే రోజున విడుదల చేసేందు నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిసింది. అందుకు అనుగుణంగానే షూటింగ్ షెడ్యూల్స్ను సిద్ధం చేస్తున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ‘దేవర’లో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ ‘వార్-2’ షూటింగ్లో జాయిన్ కాబోతున్నారు.