భిన్న ధృవాల్లాంటి వ్యక్తిత్వం కలిగిన ఇద్దరు వ్యక్తులు, వారి మధ్య అనూహ్యంగా సంభవించిన వైరం చివరకు ఎలాంటి పరిణామాలకు దారితీసింది? వారి జీవితాన్ని ఏ తీరాలు చేర్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ‘మహాసముద్రం’ చూడాల్సిందే’ అంటున్నారు అజయ్భూపతి. ఆయన దర్శకత్వంలో శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మహాసముద్రం’. అదితిరావు హైదరీ, అనుఇమ్మాన్యుయేల్ కథానాయికలు. అక్టోబర్ 14న ప్రేక్షకులముందుకు రానుంది. ఈ సినిమాలోని ‘చెప్పకే..చెప్పకే..’ అనే రెండో గీతాన్ని ఈ నెల 6న విడుదల చేయబోతున్నారు. చైతన్ భరద్వాజ్ బాణీలందించారు. ‘ప్రేమ, యాక్షన్ అంశాలు కలబోసిన చిత్రమిది. శర్వానంద్, సిద్ధార్థ్ పాత్రలు పోటాపోటీగా సాగుతాయి’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాజ్తోట, నిర్మాణ సంస్థ: ఏకే ఎంటర్టైన్మెంట్స్, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, రచన-దర్శకత్వం: అజయ్భూపతి.