ఓటీటీ మాధ్యమ శక్తి తెలుసుకున్నా అంటున్నది అందాల తార అదితీ రావ్ హైదరి. తెలుగులో
‘సమ్మోహనం’, ‘అంతరిక్షం’, ‘వీ’, ‘మహా సముద్రం’ వంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుందీ నాయిక.
ఇటీవల సినిమాల్లో అవకాశాలు తగ్గినా..వెబ్ సిరీస్లలో సత్తా చాటుతున్నది. ఆమె నటించిన రెండు వెబ్
సిరీస్లు ‘జుబ్లీ’, ‘తాజ్ డివైడెడ్ బై బ్లడ్’ ఓటీటీలో విజయవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో అదితీ
మాట్లాడుతూ…‘ఓటీటీలపై నాకు మొదట్లో చిన్న చూపు ఉండేది. నేను నటించిన సినిమాలు
థియేటర్లోనే విడుదలవ్వాలని కోరుకునేదాన్ని. నాలాగే ఎంతోమంది తారలు భావించి ఉంటారు.
అప్పట్లో మాకెవరికీ ఓటీటీ ఇంత ప్రభావవంతం అవుతుందని తెలియదు. లాక్డౌన్లో నా తొలి
మలయాళ చిత్రం ఓటీటీలో రిలీజ్ అవుతుందని తెలియగానే బాధపడ్డా. కానీ అక్కడ దక్కిన ఆదరణ
ఆశ్చర్యపోయేలా చేసింది. దీంతో ఓటీటీ విడుదల పట్ల నా అభిప్రాయం మార్చుకున్నాను. ఇవాళ దాదాపు
నటీనటులంతా సినిమా, ఓటీటీ అనే వేదికల బేధాన్ని మర్చిపోయి నటిస్తున్నారు’ అని చెప్పింది. ప్రస్తుతం
నటుడు సిద్ధార్థ్తో కలిసి డేటింగ్లో ఉందీ నాయిక.