ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న పౌరాణిక చిత్రం ‘ఆది పురుష్’. రామాయణ గాథ ఆధారంగా త్రీడీ సాంకేతికతతో దర్శకుడు ఓంరౌత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా చిత్రీకరణ శనివారం తిరిగి మొదలైంది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా దర్శకుడు ఓంరౌత్ ప్రకటించారు. ముంబయిలో జరిగే ఈ షెడ్యూల్ను ప్రభాస్ మినహా ఇతర ప్రధాన తారాగణంపై కీలక ఘట్టాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ హైదరాబాద్లో జరుగుతున్న ‘రాధేశ్యామ్’ షూటింగ్తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తిచేసిన వెంటనే అతడు ‘ఆదిపురుష్’ టీమ్లో జాయిన్ కాబోతున్నట్లు చెబుతున్నారు. కృతిసనన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్అలీఖాన్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. దాదాపు 300 కోట్ల వ్యయంతో పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్ట్లో ప్రేక్షకుల ముందుకు రానున్నది.