ముంబై: ప్రభాస్, కృతిసనన్ జోడీగా ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణ ఇతివృత్తంతో రూపుదిద్దుకున్న ఆదిపురుష్ సినిమాకు 8వ రోజైన శుక్రవారం అత్యంత తక్కువ కలెక్షన్లు వసూలయ్యాయి. తొలి వారంలో ఏ రోజూ లేనంతగా రెండో వారం మొదటిరోజున కేవలం రూ.3.25 కోట్ల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి 8 రోజుల్లో ఇంత తక్కువ కలెక్షన్లు వచ్చిన రోజు ఇదే.
ఈ సినిమాకు తొలి వారం దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిసి మొత్తం రూ.260 కోట్ల కలెక్షన్లు వసూలయ్యాయి. అందులో హిందీ భాష వాటా సుమారుగా 11 శాతం ఉన్నది. ఇంకా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఆదిపురుష్ సినిమా తొలి వారంలో రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. రెండో వారాంతంలో కలెక్షన్లు మళ్లీ పుంజుకోవచ్చని సినిమా వర్గాలు అంచనా వేస్తున్నాయి.