Adipurush Movie Pre-Release Event | సరిగ్గా పదిహేను రోజుల్లో ఆదిపురుష్ విడుదల కానుంది. రామయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను తన్హాజీ ఫేం ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. గతేడాది చివర్లో విడుదలైన టీజర్ ఓ రేంజ్లో ట్రోల్స్కు గురైంది. దాంతో చిత్రయూనిట్ దెబ్బకు ఆరు నెలలు షూటింగ్ను వాయిదా వేసి మెరుగైన వీఎఫ్ఎక్స్ను తీర్చిదిద్దడంలో మునిగిపోయింది. ఇక ఇటీవలే విడుదలైన ట్రైలర్కు తిరుగులేని రెస్పాన్స్ వచ్చింది. టీజర్తో వచ్చిన నెగిటీవిటీ అంతా ట్రైలర్తో పటా పంచలయింది. మరో రెండు వారాల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై యావత్ సినీ ప్రేమికులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ రెండు వారాలు చిత్రయూనిట్ ప్రమోషన్లతో తెగ బిజీ కానున్నట్లు తెలుస్తుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను జూన్ 6న తిరుపతిలో భారీ ఎత్తులో జరుపనున్నారు.
ఇక ఇప్పటికే ఈవెంట్ కు సంబంధించిన పనులు ప్రారంభమైనట్లు తెలుస్తుంది. ఇక ఇండియన్ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ జరుగుని రేంజ్ లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. జై శ్రీరామ్ అనే శబ్దం వచ్చేలా బాణసంచాను ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నారట. కేవలం వాటి కోసమే దాదాపు యాభై లక్షలకు పైగా ఖర్చు చేయనున్నారని తెలుస్తుంది. అంతేకాకుండా ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముంబై నుంచి రెండొందల డ్యాన్సర్లు, రెండొందల సింగర్లు రానున్నారట. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రేంజ్లో చేయడమనేది మాములు విషయం కాదు. ఈ సినిమాను తెలుగులో పీపుల్ మీడియా సంస్థ రిలీజ్ చేస్తుంది. ఇక ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను జీఎస్టీతో కలిసి రూ.185 కోట్లకు కొనుగోలు చేసింది. బ్యాక్ టు బ్యాక్ రెండు ఫ్లాపులు వచ్చిన ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని ఆ ఫిగర్సే రుజువు చేస్తున్నాయి.
ట్రైలర్ తో పాటు పాటలు కూడా ఈ సినిమాపై ఎక్కడలేని హైప్ తీసుకొచ్చాయి. ముఖ్యంగా జై శ్రీరామ్ అనే పాట సినిమాపై తిరుగులేని బజ్ ను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్కు జోడీగా కృతిసనన్ నటించింది. సైఫ్ అలీఖాన్ లంకాధిపతి రావణాసురుడుగా కనిపించనున్నాడు. టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్తో దాదాపు రూ.500 కోట్లతో ఈ సినిమాను నిర్మించాయి. ఇక ఈ సినిమాను దాదాపు 10 భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.