Adipurush | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానున్నది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రామాయణం ఇతివృత్తంగా చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రభాస్తో రాముడిగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ లంకేశుడిగా కనిపించనుండగా.. సన్నీ సింగ్, దేవదత్ నాగే ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు.
సినిమా విడుదలకు ముందు బాలీవుడ్ నటుడు అమీర్ఖాన్ భూషణ్ కుమార్, ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్, ఓం రౌత్ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అమీర్ కంపెనీ అమీర్ఖాన్ ప్రొడక్షన్ అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ షేర్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ‘ఆదిపురుష్’ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఆదిపురుష్ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్కు అపూర్వ స్పందన వస్తున్నది. తొలిరోజే బంపర్ ఓపెనింగ్స్ను చిత్రం రాబట్టగలుగుతుందని మేకర్స్ భావిస్తున్నారు. గతంలో ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ‘తన్హా జీ – ది అన్సంగ్ వారియర్’ బాక్సాఫీస్ బ్లాక్బస్టర్గా నిలిచి భారీగా వసూళ్లను రాబట్టింది.
ఓం రౌత్ కెరియర్లో ‘ఆదిపురుష్’ రెండో చిత్రం కాగా.. ఈ చిత్రంపై భారీగానే ఆశలున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్కు ఆదరణ లభించింది. ఇదిలా ఉండగా.. అమీర్ఖాన్ చివరిసారిగా ‘లాల్సింగ్ చద్దా’ చిత్రంలో కనిపించాడు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉండగా.. కుటుంబంతో గడపాలని భావిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. అయితే, సినిమాలు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు మంచి స్క్రిప్ట్ కోసం చూస్తున్నట్లు సమాచారం.