త్రినాథ్వర్మ, యశ్వంత్ పెండ్యాల, తన్వీ నేగి, సహర్ కృష్ణన్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న రొమాంటిక్ థ్రిల్లర్ ‘అదే నీవు అదే నేను’. కొండల్ దర్శకుడు. గోవిందు కాండ్రేగుల నిర్మాత. త్వరలోనే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కానున్నది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాలోని పాటను మంగళవారం విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ పాటను లాంచ్ చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
‘మనసా మనసా..’ అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్ని పూర్ణాచారి రాయగా, కనిష్క్ స్వరపరిచారు. జావెద్ అలీ ఆలపించారు. ‘ఎన్నెన్నో వర్ణాలున్నా నీవు లేని వెలితేదో మిగిలున్నదే.. ఎన్నాళ్లకైనా నిన్ను చూశానన్న ఆనందం నా సొంతమే.. మారిందే వరసా.. నీకైనా తెలుసా.. మనసా.. మనసా..’ అంటూ సాగే ఈ పాటను దర్శకుడు కొండల్ పొయెటిక్గా, సెన్సిబుల్గా తెరకెక్కించారని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రంలోని పాటలను ఆదిత్య మ్యూజిక్ విడుదల చేస్తున్నది.