Aadavallu meeku joharlu | యువ హీరో శర్వానంద్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ఆడవాళ్ళు మీకు జోహార్లు. చిత్రలహరి ఫేం కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్నిసుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ క్రమంలో ఈ చిత్రానికి నాన్-థియేట్రికల్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయని సమాచారం.
ఈ చిత్రానికి నాన్ థియేట్రికల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లివ్ 25కోట్లకు కొనుగోలు చేసిందని సమాచారం. మీడియం హీరో అదికూడా వరుస ఫ్లాప్స్లలో ఉన్న శర్వానంద్ సినిమాకు ఇంతమేర బిజినెస్ జరగడం విశేషం అనే చెప్పాలి. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు లిరికల్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. రాక్స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. గత కొంత కాలంగా శర్వానంద్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. మహానుభావుడు తర్వాత ఇప్పటి వరకు శర్వానంద్కు హిట్ లేదు. ఈ చిత్రంతోనైనా శర్వానంద్ తిరిగి ట్రాక్లోకీ వస్తాడా లేదా చూడాలి మరి.