Adah Sharma | అందగత్తె మాత్రమే కాదు, ఆదాశర్మ అద్భుతమైన నటి కూడా. ‘ది కేరళ స్టోరీ’తో నటిగా ప్రేక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేసింది తను. ప్రస్తుతం ఆదాశర్మ ఏం చేసినా న్యూసే. తాజాగా దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ ఇంటిని కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో ఆ ఇంటిని చూడటానికి వెళ్లింది ఈ అందాల భామ. అంతే.. ఆ ఇంటిని తను కొనేసిందంటూ వార్తలు రావడం, ఇందులో భాగంగా సుశాంత్ సింగ్ రాజ్పుత్ అదే ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడంటూ పాత స్టోరీలను తిప్పిరాయడం మొదలుపెట్టింది మీడియా. దాంతో ఆదాశర్మకు ఈ విషయంపై స్పందిచక తప్పలేదు.
‘ఈ భూమ్మీద లేని వ్యక్తి గురించి ఇష్టం వచ్చినట్టు రాయడం.. మాట్లాడటం సమంజసం కాదు. సుశాంత్ గొప్ప సినిమాల్లో నటించారు. మంచి నటుడు. ఆయన గౌరవాన్ని కాపాడటం మనందరి ధర్మం. ఆ ఇంటిని కొనలేదు. చూడ్డానికి వెళ్లాను. దాంతో మీడియాపై నాపై ఫోకస్ పెట్టింది. నాపై ఆ మాత్రం ఫోకస్ ఉన్నందుకు సంతోషం. నేను ఆ ఇంటిని నిజంగా కొంటే తప్పకుండా అందరికీ చెబుతాను. ప్రస్తుతం ప్రేక్షకుల గుండెల్లో ఉంటున్నా. అద్దె చెల్లించాల్సిన అవసరం కూడా లేదు’ అంటూ అందంగా నవ్వేసింది ఆదాశర్మ.