‘యే రిష్తా క్యా కేల్తా హై’, ‘ససురాల్ సిమర్ కా’ వంటి పలు హిందీ సీరియల్స్ ద్వారా బుల్లితెర వీక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న యువ నటి వైశాలి ఠక్కర్ ఆత్మహత్య చేసుకుంది. ఆమె వయసు 30 ఏండ్లు. గత కొంతకాలంగా ఆమె తన తల్లిదండ్రులతో కలిసి మధ్యప్రదేశ్ ఇండోర్లో నివాసముంటున్నది. వైశాలి ఆదివారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గదిలో ఆమె రాసిన సూసైడ్ నోట్ లభించింది. తన మాజీ ప్రియుడు వేధింపులకు గురి చేస్తున్నాడని ఆమె లేఖలో పేర్కొందని, కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించామని పోలీసులు తెలిపారు. గతేడాది వైశాలికి కెన్యాకు చెందిన వైద్యుడు అభినందన్ సింగ్తో నిశ్చితార్థం జరిగింది. కొన్ని నెలల తర్వాత ఈ పెళ్లిని వైశాలి వద్దనుకుని ఎంగేజ్మెంట్ రద్దు చేసుకున్నారు. వైశాలీ ఠక్కర్ ఆత్మహత్య చేసుకుందనే విషయం ఉత్తరాది టీవీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది.